కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందులయ్యాయని బీసీ నేతలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందులయ్యాయని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇక్కడేమో ‘అన్నా టికెట్ మీకే గ్యారంటీ’ అని, చెప్తూ ‘అక్కడేమో (ఢిల్లీ) వేస్ట్ క్యాండేట్ గెలువడ’ని చెప్తున్నారట. ఇదే విషయంపై కొందరు నాయకులు రేవంత్ను నిలదీస్తే, ‘నాదేమీ లేదు, అంతా సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ప్రకారమే జరుగుతుంద’ని బుకాయిస్తున్నారట. ఈ ముచ్చట బీసీ నేతల మీటింగ్లో ఒక నాయకుడు పూసగుచ్చినట్టు చెప్పి వాపోయినట్టు సమచారం.
ఈ బీజేపీకి ఏమైంది!
ఒకవైపు కొండన్న, మరోవైపు బండన్న. పార్టీలో ఒక నాయకుడేమో పార్టీ గెలువదు గాక గెలువదంటాడు. ఇంకొక్కరేమో మాది థర్డ్ ప్లేసే అంటారు. మరొకరేమో మేము గెలువకపోయినా ఫర్వాలేదు, కాంగ్రెస్ మాత్రం గెలువద్దంటాడు. ఇంకో ఆయనేమో ‘ఇక చేరికలుండకపోవచ్చు, ఎవరు వచ్చే పరిస్థితి లేదంటారు. ఒకామేమో సోనియమ్మ అంటే తనకు ఎక్కడలేని అభిమానం అంటూ పొంగిపోతది. మొత్తమ్మీద వీరి మాటలు, చేష్టలు చూస్తే గుజరాతీ బాస్లకు సరైన మొగుళ్లే దొరికారనిపిస్తున్నది.
కాంగ్రెస్లో చేరినట్టే ‘మమ’
కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో పాపం రాజన్న బిడ్డ షర్మిల పరిస్థితి ఇలా అయిందేమిటి? అని సానుభూతి వ్యక్తమవుతున్నది. కానీ, షర్మిల మాత్రం అలా అనుకోవడం లేదు. తనకు తానే కాంగ్రెస్లో విలీనమైనట్టుగానే భావిస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై టీపీసీసీ నాయకుల కంటే ముందే ఆమె స్పందిస్తూ వారి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టే విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్గా మారడం వల్లనే మోదీని ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. మన పరిస్థితి ఇప్పటికే ‘అటు.. ఇటు’ కాకుండా పోయింది. కాంగ్రెస్ నాయకుల్లా బీఆర్ఎస్, బీజేపీని ఒకేగాటన కట్టి విమర్శించడం అవసరమా? అని ఒక నాయకుడు ప్రశ్నిస్తే, మనది కాంగ్రెస్సే.. కానీ, అది తెలంగాణకా? ఆంధ్రాకా? అనేది తేల్చుకోవడం ఒక్కటే తర్వాయి అని వివరించిందట.
వన్స్ అపాన్…
వికారాబాద్కు చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. వికారాబాద్ టికెట్ ఇవ్వలేం అక్కడ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్రావు ఉన్నారు. మరేదైనా రిజర్వ్డ్ సీటు ఉంటే చూసుకోండని కాంగ్రెస్ పెద్దలు సూచించారట. జహీరాబాద్ కూడా రిజర్వ్ సీటే. అదైనా తనకు ఓకే అన్నారట. మీదేమో ఓల్డ్ రంగారెడ్డి, అదేమో ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్. ఇక్కడినుంచి వెళ్లి అక్కడ పోటీ చేస్తే ఎలా గెలుస్తారనడిగితే.. ఒకప్పుడు మా పూర్వీకులది కూడా జహీరాబాదే అంటూ ఫ్లాష్బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పారట. నేతలతో పెట్టుకుంటే అట్లుంటది మరి.