రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ‘తొలిమెట్టు’, ‘మన ఊరు-మనబడి’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. వాటిద్వారా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అందిస్తున్నది. క్రీడాస్థలం, యోగ క్లాసులు, రీడింగ్ అవర్ మొదలగు వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్లను ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సం ఖ్యకనుగుణంగా లైబ్రరీ కార్నర్లు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 41,016 ప్రభు త్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 58,25, 033 మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. వీరికి 2,82,456 మంది ఉపాధ్యాయు లు విద్యాబోధన చేస్తున్నారు. వారికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయాలు ఏర్పాటుకానున్నాయి.
పాఠశాల గ్రంథాలయం: విజ్ఞాన సమాచార కూడలి, పఠనం, విచారణ, పరిశోధ న, ఆలోచన, ఊహాకల్పన, గుణాత్మక, సృజనాత్మకతతో కూడిన సమాచారం లభించే కేంద్ర స్థానం గ్రంథాలయం. అదేవిధంగా విద్యార్థుల వ్యక్తిగత, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధికి, ఆలోచనలకు జన్మస్థానమిది. విద్యార్థులను ఆకట్టుకునేలా గ్రంథాలయా ల్లో సమాచార వనరులు, పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. భౌతిక వనరులే కాకుండా మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ వనరులు కూడాఅందుబాటులో ఉంచేవిధంగా ప్రయత్నం చేయాలి.
గ్రంథాలయాల ముఖ్య ఉద్దేశం: విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని అందజేయడం ద్వారా వారిని విజ్ఞానవంతులుగా చేసి సమాజానికి ఉపయోగపడే లేదా తోడ్ప డే నైతిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారుచేయడం. గ్రంథాలయాల ద్వారా జ్ఞానం అర్జించిన విద్యార్థులు తమ సొంతం గా చదువుకునే శక్తి కలిగినవారై, వారికి కావలసిన సమాచార అవసరాలను గుర్త్తెరిగి సరై న ఆలోచనా విధానంతో, సత్ప్రవర్తనతో నడుచుకుంటారు. సమస్యలను పరిష్కరించుకునే ధైరాన్ని కలిగి ఉంటారు. అదేవిధం గా వారికి సరైన సమాచారాన్ని తెలుసుకోగలిగిన నేర్పును, ఓర్పును కలిగి ఉంటారు.
పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంపొందించడం, మరీ ముఖ్యంగా విద్యారుల్లో పఠనాభిరుచిని పెంపొందించడం, అదేవిధంగా ఉపాధ్యాయులకు నూతన సమాచార అన్వేషణ కోసం కావలసిన వనరులను సమకూర్చడం, విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమాచార సాధనాలు, సమాచార నిపుణతలు, సమాచార పోటీ, సమాచార స్వచ్ఛత పై అవగాహన కల్పించడం, పరిశోధనతో కూడిన అభ్యసనం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో సమాచారం అందించడం అలవడుతుంది. వ్యక్తిగత ఉత్సుకత, సృజనాత్మకత, జ్ఞానం అందించే ప్రాంతం గ్రంథాలయం. అవసరమైతే పౌర గ్రంథాలయాల వనరులను వినియోగించుకునే విధంగా పాఠకులకు అవకాశం కల్పించాలి.
కరోనా కాలంలో 2020-2022 రెండు విద్యా సంవత్సరాలు విద్యార్థులు ప్రత్యక్ష విద్యకు దూరమయ్యారు. కనీసం, చదవడం, రాయడం, సబ్జెక్టుల మీద పట్టు లేకుండాపోయింది. వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాల ల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసింది. కొన్నిచోట్ల కంటైనర్ గ్రంథాలయాలను కూడా ఏర్పాటుచేసింది.
ముఖ్యంగా ‘తొలిమెట్టు’, ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కావలసిన మౌలికవసతులు కల్పించడంతో పాటు గ్రంథాలయాలు కూడా ఏర్పా టు చేయాలని ఆలోచించింది. అందులో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నది. తొలుత రంగారెడి ్డజిల్లాలోని 148 ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటవుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలోనూ 154 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క పాఠశాల లైబ్రరీలో 240 పుస్తకా లు అందుబాటులో ఉంటాయి. వాటిలో బేసిక్ తెలుగు, ఆంగ్లం, గణితం, అటలు, నీతికథలు, కథలు, డ్రాయింగ్, పెయింటింగ్ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నేషనల్ బుక్ట్రస్ట్, రూమ్ టు రీడ్ వంటి సంస్థలు కొన్ని సంస్థలు కూడా విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను అందించనున్నాయి. ‘రీడింగ్ కార్నర్స్’లో బుక్ ర్యాక్స్, బీరువాలు, రీడింగ్ టేబుళ్లు, పిన్ డిస్ప్లే బోర్డులు, కూర్చునేందుకు కార్పెట్స్, పుస్తకాల నిర్వహణకు రిజిష్టర్ వంటి వసతులను కల్పిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆన్లైన్ పుస్తకాలు, టీ సాట్ పాఠాలు, నేషనల్ డిజిటల్ లైబ్రరీలోని ఆైన్లైన్ పుస్తకాలు, వీడియో పాఠాలు మొదలగు పుస్తకాలు, వీడియో లెక్చరర్స్ వీక్షణకు కంప్యూటర్, ఉచిత అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేస్తారు. రీడింగ్ కార్నర్స్ నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వాటితో పాటు గ్రంథాలయ కమిటీ వేయనున్నారు. నిత్యం పాఠశాలలోని సమయ పట్టికలో లైబ్రరీ అవర్ కేటాయించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు కృషిచేయడం ఆహ్వానించదగిన పరిణామం.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం, హైదరాబాద్)
– డాక్టర్ రవికుమార్ చేగొని 98669 28327