గత ఎనిమిదేండ్ల నుంచి భారతదేశం ఎటు పయనిస్తున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్ని సర్వేలు చూసినా కేంద్ర ప్రభుత్వ పనితీరు అధోగతే. నోట్ల రద్దుతో దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసిన బీజేపీ ప్రభుత్వం సామాన్యుల కలలను కల్లలు చేసింది. అభివృద్ధిని పక్కనపెట్టి ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారతావనిని చెదలు పట్టిస్తున్న క్షుద్ర రాజకీయపార్టీని నేలకేసి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ దారిద్య్రాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది. ఎనిమిదేండ్ల నుంచి పచ్చి అబద్ధాలు, గోల్మాల్ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నది. ప్రభుత్వాన్ని నడపడం రాదు. ప్రజల మీద పన్నులు వేయడమొక్కటే వస్తది. ఈ ఎనిమిదేండ్లలో ఒక్క మీడియా సమావేశం నిర్వహించని ప్రధాని మోదీ దేశానికి చేసింది సున్నా. రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు తెచ్చి 700 మంది అన్నదాతల ఆత్మఘోషకు కారణం నరేంద్ర మోదీ కాదా? కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఉగ్రవాదులు, అర్బన్ నక్సల్స్ ముద్రవేసింది మీరు కాదా? రోగమొస్తే ధైర్యం చెప్పాలి, తగిన మందులివ్వాలి. కానీ బీజేపీ మత పిచ్చి దేశ ప్రజల ప్రాణాలు తీస్తున్నది. ఎందుకు మోదీ జీ దేశ ప్రజల జీవితాలను కుల్లబొడుస్తున్నారు? మీకు అధికారం ఇవ్వడమే మేం చేసుకున్న పాపమా?
దేశంలో ధరలు పెరిగిపోయాయి. నిరుద్యోగం ఎక్కువైంది. మత విద్వేషాలు ఆందోళన కలిగిస్తున్నా యి. అవినీతి కట్టలు తెంచుకున్నది. ప్రైవేటీకరణ జోరందుకున్నది. పేదల సంక్షేమం అటకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని ముందుకునడిపించే నాయకుడు ఎవరని దేశం ఆశగా ఎదురుచూస్తున్నది. దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్న నేత, దేశాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దేశాన్ని పాలించే అవకాశం ఒకసారి ఎందుకివ్వకూడదని ఆలోచిస్తున్నది. రైతుబం ధు, రైతు బీమా, దళితబంధు, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఐటీ, ఫార్మా రంగాలకు చేయూత, చేనేతలకు ప్రోత్సాహం లాంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆరే దేశాన్ని నడిపించే నాయకుడని విశ్వసిస్తున్నది.
సర్వ మతాలకు, కులాలకు సన్నిహితుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అందరికీ ప్రేమను పంచే ఆయన గొప్ప లౌకికవాది. ఆపదలో ఉన్నవారు శత్రువైనా ఆదుకుంటారు. మానవీయ కోణంలో ఆలోచిస్తారు. చింతమడకలోని తన వారసత్వ ఆస్తులను ప్రభు త్వ పాఠశాలకు, దవాఖానకు దానంగా ఇచ్చిన సహృదయులు. తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండవర్గాలను ఏకతాటిపైకి తెచ్చి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఎనిమిదేం డ్లుగా తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం కృషిచేస్తున్న దార్శనికుడు. దేశాభివృద్ధి పట్ల కచ్చితమైన విజన్ ఉన్న నాయకుడు.
ప్రజలే కేంద్రంగా దేశ రాజకీయాలు, అభివృద్ధి సాగాలని ఆయన కోరుకుంటున్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఈ దేశం యువతది. వారే ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో యువత చైతన్యవంతం కావాలి. బీజేపీ కుహనా పాలనకు చరమగీతం పాడాలి. కేసీఆర్తో చేయి చేయి కలిపి సాగాలి. దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించాలి. దేశ ప్రజలందరూ కేసీఆర్కు మద్దతుగా నిలబడితే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది.
(వ్యాసకర్త: చిటుకుల మైసారెడ్డి , 94905 24724, సీనియర్ పాత్రికేయులు)