మదర్ ఆఫ్ డెమోక్రసీలో రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని ఆదివారం దేశమంతా చూసింది. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న సమయంలోనే ఈ ఘట న జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి, 11 కోట్ల మంది మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రధాని ఉపన్యసిస్తున్న సమయంలో రెజ్లర్లను వందలాది మంది పోలీస్లు ఈడ్చుకెళ్లి, అరెస్టు చేసిన దృశ్యాలు టీవీల్లో కనిపించాయి!
తమను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 35 రోజులుగా జంతర్-మంతర్ వద్ద ప్రపంచ మహిళా కుస్తీ ఛాంపియన్లు సత్యాగ్రహం,ధర్నా చేస్తున్నారు! సుప్రీంకోర్టు ఆదేశంతో అతనిపై ఒక పోక్సో కేసు సహా రెండు కేసులు నమోదయ్యా యి! అయినా ఆయనపై పోలీస్ల చర్యలు లేవు. పైగా తాను గతం లో ఒకరిని కాల్చి చంపానని, బహిరంగంగా ప్రకటించాడు. తాను నార్కోటిక్ టెస్ట్కు కూడా రెడీ అని చెప్పాడు. ప్రధాని, హోమ్ మినిస్టర్ చెబితేనే అరెస్ట్ అవుతానని స్పష్టం చేశాడు. తాను ఐదు సార్లు ఎంపీగా గెలిచానని, తనకు తిరుగులేని బలం ఉందని, మైండ్గేమ్తో బీజేపీ నేతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు!
బ్రిజ్ భూషణ్ 40 కేసులున్న అతి పెద్ద కిమినల్. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి వెళ్లి దర్జాగా కూర్చున్నాడు! పొక్సో కేసులో నిందితుడిగా ఉండి ఇలా బరి తెగించడం, బహుశా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే మొ దటి సారి కావచ్చు! డెకాయిట్ మర్డర్,అటెంప్ట్ మర్డర్, మర్డర్, అటెంప్ట్ టు రేప్ లాంటి కేసులు బ్రిజ్ భూషణ్ మీద ఉన్నాయి! బీజేపీ నేతల్లో ఎమ్మెల్యేలు,ఎంపీల మీద, చివరికి మంత్రుల మీద కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. ఒకరిద్దరి మీద లైంగిక కేసుల ఆరోపణలు ఉన్నాయి!
ప్రజాస్వామ్య దేశంలో బాధిత ఆడపిల్లల గొంతు వినే వారు కరువవ్వడం విచారకరం. వినేష్ ఫోగట్, సునీతా ఫోగట్, సాక్షి మాలిక్ను అరెస్టు చేసి తీసుకెళుతున్న సందర్భంలో వినే ష్ ఫోగట్ మాట్లాడుతూ ‘పోలీస్లు తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదని, దేశం తన బిడ్డలకు ఇస్తున్న గౌరవం చూడండి’ అంటూ వాపోయారు! దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నించే గొంతుకలను, బాధితులను, మానవ హక్కులను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై సాగిస్తున్న అణచివేతలు తప్పని సరిగా చరిత్రలో లిఖించబడుతాయని ఆమె అన్నారు. ఎందరో భారతీయ బిడ్డలకు జ రుగుతున్న అన్యాయాల ఆత్మ ఘోష ఇది! ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదు!
మరో వైపు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్ళనీయకుండా వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మహిళా రైతులను ఎక్కడికక్కడ నిలిపి వేశారు! ఇండ్ల వద్దే నిర్భంధించా రు. చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు! గాజీ బోర్డర్ వద్ద రైతు ఐక్య వేదిక నేత రాకేష్ తికాయత్ను, వేలాదిమంది రైతుల ను నిలిపివేశారు. ‘కుస్తీ బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే తమ ఆందోళన నిరవధికంగా కొనసాగిస్తామన్నారు. వినేష్ ఫోగట్ కూడా మహిళా రైతులు రోడ్ల మీదే ఎక్కడికక్కడ కూర్చుని నిరసన తెలుపాలని కోరారు! ఇదేనా? దేశం ప్రమోట్ కావడమంటే? ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించడమేనా? చెప్పండి! ఆడపిల్లలు తమ మీద లైంగిక వేధింపులు జరిగినా నోరెత్తవద్దు. తల్లిదండ్రులకు చెప్పుకోవద్దు, గొంతెత్తితే ఏం జరుగుతుందో చూడండంటూ కేంద్రం తన రాజకీయ పవర్ ద్వారా చూపిస్తున్నది! నిజానికి ప్రతిచోట లైంగిక వేధింపులుంటాయి! అవి శృతిమించినపుడే ఇలా రోడ్డు మీదకు రాక తప్పదు.
ఈ విషయం ప్రధాని మోదీకి తెలుసు. ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చినపుడు వినేష్ ఫోగట్ తదితరులను పిలిచి మోదీ ప్రశంసించినపుడు వారు బ్రిజ్ భూషణ్ వ్యవహారం గురించి చెప్పారు! అయినా ప్రధాని ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడమంటే, ఆడబిడ్డలకన్నా ఆయనకు పవర్ ముఖ్యమని తేలిపోయిం ది! 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం! అందులో గెలువడం ముఖ్యం! ఆడబిడ్డల పరువు, ప్రతిష్టలు ఆయనకు అక్కరలేదు.
జంతర్ – మంతర్ వద్ద టెంట్లు కూల్చి రెజ్లర్ల సామాగ్రి అం తా తీసేసి ఆ స్థలాన్ని పోలీస్లు స్వాధీనం చేసుకున్నారు. అయినా తమ పోరాటం ఆగదని రెజ్లర్లు ప్రకటించారు. తమ పోరాటాన్ని ఇండియాగేట్ వద్ద కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమకు జాతీ య అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పతకాలను గంగానదిలో పారేస్తామని కూడా వారు ప్రకటించారు. ఇది మహిళా లోకం విసురుతున్న సవాల్.
అటువంటి ఆడబిడ్డలకు దేశమంతా మద్దతునివ్వాలి. ప్రతి ఒక్కరూ నిరసన తెలుపాలి. కుస్తీ బిడ్డలకు అండగా నిలబడాల్సిన తరుణం! తానా షాహీ గిరికి బు ద్ధ్ది చెప్పి, మట్టి కరిపించాల్సిన స మయం!ఆజ్ నహీతో కల్ నహీ!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎండీ.మునీర్
99518 65223