‘నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదకుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కవిరాజు కావ్యాలు కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లెరా’ అన్నారు తెలంగాణ ప్రజాకవి కాళోజీ. ఆ మాటలకు అర్థం దేశానికి అన్నం పెట్టే రైతన్న సాగు సరిగా ఉంటేనే మనమంతా బాగుంటామని. ఇది అక్షరసత్యం. రాష్ట్రంలో వ్యవసాయం బాగు కావడానికి 60 ఏండ్లు దొరకని సమాధానం కేవలం తొమ్మిదిన్నరేండ్లలో దొరకడానికి ఏకైక కారణం మన విజనరీ ముఖ్యమంత్రి కేసీఆర్.
రైతును కడుపులో పెట్టుకొని చూసుకొన్న ప్రభుత్వం ఈ దేశంలోనే కాదు, బహుశా ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదని నా ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో కరెంటు, నీళ్లు లేవు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు పోవుడు, చాలా భయంకరమైన బాధలుండేవి. కుటుంబమంతా చెట్టుకొకరు, గుట్టకొకరు అయ్యారు. ఇవన్నీ సునిశితంగా గమనించిన అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ పాలన చేపట్టిన వెనువెంటనే అనేక అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచారు. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 450 సంక్షేమ పథకాలతో కేసీఆర్ సర్కా రు అగ్రభాగాన ఉన్నది.
విషాదకరమైన విషయం ఏంటంటే మనరాష్ట్రంలో గాడ్సేలు గాంధీభవన్కు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వరం మారింది. దురదృష్టం ఏంటంటే, తరం మారుతున్నా తన వైఖరి మాత్రం కాంగ్రెస్ పార్టీ మార్చుకోవడం లేదు. లక్ష్య సిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనే కేసీఆర్ ముందు కాంగ్రెస్ వైఫల్య ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయడం లేదు. తన గమ్యం కోసం చావు నోట్లో తలపెట్టిన నేత ఆయన. ఆ మహనీయుడి కృషితో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో సీమాంధ్ర పాలకులు, ఇదే కాంగ్రెస్ నా యకులు కొత్తరాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని, తెలంగాణ చీకటవుతుందని, భూముల ధరలు పడిపోతాయని భయపెట్ట చూశారు. అలాంటిది ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
వ్యవసాయ స్థిరీకరణ జరుగాలని రైతులను బాగుచేసుకున్నాం. రైతుబంధు పేరుతో రైతన్నల అకౌంట్ల లో రూ. 72 వేల కోట్లు వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అనటంలో అతిశయోక్తి కాదు. కానీ, కొంతమం ది కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నా రు. 24 గంటల కరెంటు వద్దు. 3 గంటలు చాలంటున్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇదీ వ్యవసాయంపై వారి దృక్పథం. పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన తెలంగాణలో ఆ పార్టీ నాయకులకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం.
రైతుల భూములకు నష్టం కావొద్దని ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్తోనే రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ఒక పక్క రైతులు చెప్తుంటే, దాన్ని తొలగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్ప టం హాస్యాస్పదం. ఇటువంటి వైఖరి కల్గిన కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి, అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలకు పంచుతున్నది. ఇవన్నీ ఉండాలంటే, మళ్ళీ మన కారు పార్టీ సారును గెలిపించాలి. లేదంటే, పదేండ్లు పడిన శ్రమ వృథా అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.
నా పార్లమెంట్ పరిధిలోని పలువురు అభ్యర్థుల వెంట నేను ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరి మదిలో కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలే కదలాడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే, బీఆర్ఎస్ సర్కారు తన సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమందిని కదిలించిందన్న విషయం నాకు అవగతమైంది. ఏ గ్రామం చూసినా మరే తండా చూసినా అపూర్వ స్పంద న లభిస్తున్నది. అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో మళ్లీ పాత కథ నే రావాల్నా. అదే జరిగితే మన రాష్ట్ర ప్రజల కథ కంచికి చేరుతుంది. ఇవన్నీ యువత, బుద్ధిజీవులు ఆలోచించాలి. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో బలిదానాల ఆధారంగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే దారికి వచ్చింది. కాపాడుకోవలసిన అవసరం, ఆవశ్యకత అందరిపై ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు 24 గంటల కరెంట్ కావాల్నా! కాంగ్రెస్ చెప్తున్నట్టు 3గంటలే కావాల్నా? రైతుబంధు కావా ల్నా? రాబందు కావాల్నా? ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తున్నారు.
58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా, కరెంటు తేకుండా ప్రజలను అరిగోసపెట్టింది. పదేండ్లుగా పార్లమెంట్ చట్టాలను ఉల్లంఘించి బీజేపీ ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఇక్కడ ఉన్న ఆ పార్టీ ఎంపీలకు అడిగే దమ్ములేదు. వారివి ఎంతసేపు మతోన్మాద, కులోన్మాద ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు.
ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లడిగేందుకు వస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు చాలా ప్రమాదం పొంచి ఉన్నది. కనుక ఆ పార్టీలను ప్రజలు నమ్మొద్దు. మూ డోసారి అధికారంలోకి రాగానే ఇ ప్పుడున్న పథకాలతోపాటు కొత్త వాటిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్లే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత మ నందరిపై ఉన్నది.
(వాసకర్త : పార్లమెంట్ సభ్యులు, చేవెళ్ల)
– డాక్టర్ జి. రంజిత్ రెడ్డి