రానున్న ఆరునెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంకా ముందుగానే జరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ ఏడాది దంచి కొడుతున్న ‘మే’ నెల ఎండలకంటే ఎక్కువగా తెలంగాణలో ఎన్నికల వేడి దగడుకొడుతున్నది. ఈసారి ప్రాంతీయపార్టీ నుంచి జాతీయపార్టీగా మారిన భారతరాష్ట్రసమితి, నూరేండ్ల చరిత్రకు పైనున్న కాంగ్రెస్ పార్టీ, మతతత్వ ఎజెండాతో బీజేపీ, బహుజన రాజ్యాధికార ఎజెండాతో బీఎస్పీ జాతీయపార్టీలుగా బరిలోకి దిగుతున్నాయి. షర్మిలా వైఎస్సార్కాంగ్రెస్, జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలున్నా అవన్నీ నామమాత్రంగా కూడా ప్రభావం చూపే అవకాశం లేదు. సందట్లో సడేమియాలా శవప్రాయమైన టీడీపీని మళ్ళీ తెలంగాణలో బతికిద్దామనుకుంటున్న చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గట్టుకు కట్టెలు మోయడం లాంటిదే.
కాంగ్రెస్ కొన్ని రాష్ర్టాల్లో బలంగానే ఉన్నా తెలంగాణలో అంతఃకలహాలతో కునారిల్లుతూనే ఉన్నది. 75 సంవత్సరాలుగా లేని బీసీలపై ప్రేమను ఇప్పుడు కురిపించాలని చూస్తున్నది. బీసీలకు ఎక్కువ సీట్లిస్తామని మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుచుకున్న మూడు పార్లమెంటు సీట్లలో ఒక్కరూ బీ సీలు లేరు. 56 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్క బీసీలేడు.
జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా తమ తమ విభిన్న ఐడియాలజీతో పరస్పరం తలపడుతున్నాయి. సహజంగానే ఒకర్నొకరు ఓడించుకోవడానికి దీర్ఘకాల పోరాటాలు చేస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ మిగతా పార్టీతో కలిసి కేంద్రంలో బీభత్స పాలన చేస్తున్న బీజేపీని ఓడించటానికి సిద్ధంగా లేవు. స్వయంగా గెలిచి పాలనా పగ్గాలు అందుకునే స్థితిలోనూ లే వు. ఎందుకంటే గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న పనులు ‘నభూతో నభవిష్యత్’ అన్నట్టుగా దేశానికే రోల్మాడల్గా రాష్ర్టా న్ని నిలిపేవిగా ఉన్నాయి కాబట్టి.
ఈ పార్టీలన్నీ గతంలో, ప్రస్తుతం కూడా కొన్ని రాష్ర్టాల్లో పాలనలో ఉన్నాయి. బీఆర్ఎస్ దరిదాపులకు వచ్చే స్థితిలో కూడా ఆయా రా ష్ర్టా ల్లో పాలన జరుగడం లేదన్నది వాస్తవం.. అయినా కేంద్రంలో పాలనలో ఉన్నామన్న ధైర్యంతో ఫెడరలిజానికి భంగం కలిగిస్తూ, మతతత్వ ఎజెండాతో బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నది.
మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలు బహిరంగంగానే చేస్తున్నది. మైనారిటీలపై ద్వేషాన్ని రెచ్చగొడుతూ
మనుషులను విడగొడ్తున్నది.భారత రాజ్యాంగాన్నే మార్చి మధ్యయుగాల నాటి సిద్ధాంతాలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నది. దేశాభివృద్ధి, మానవ వనరుల వినియోగం, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన లాంటివేవీ
చేయకుండా ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్నది.
దేశంలో పేదరికం, నిరుద్యోగం విశృంఖల విహారం చేస్తుంటే ఉన్న పరిశ్రమలనూ మూసివేస్తున్నది. అంతేకాకుండా కేసీఆర్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి బలమైన నాయకులను, రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నది. ద్వే షం పునాదులపై అంతస్థుల భవనాలు నిర్మిం చి, మత సెంటిమెంట్లతో గెలువాలని ప్రయత్నించడం ఎన్నో పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సా ధించుకున్న తెలంగాణ ప్రజలు గమనిస్తున్నా రు. తెలంగాణలో బీజేపీకి శృంగభంగం తప్పదని కేసీఆర్ పాలన, పథకాలు చెప్పకనే చెబుతున్నాయి. కేంద్రం ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచిపనీ చేయకుండా సార్వభౌమత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నది. మతద్వేషమే పునాదులుగా గెలువడం అసాధ్యమన్న విషయం ఈ తొమ్మిదేండ్లలో ఎన్నోసార్లు రుజువుచేసింది. ఇప్పుడూ అదే జరుగుతుంది.
ఇక కాంగ్రెస్ కొన్ని రాష్ర్టాల్లో బలంగానే ఉన్నా తెలంగాణలో అంతఃకలహాలతో కునారిల్లుతూనే ఉన్నది. 75 సంవత్సరాలుగా లేని బీసీలపై ప్రేమను ఇప్పుడు కురిపించాలని చూస్తున్నది. బీసీలకు ఎక్కువ సీట్లిస్తామని మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుచుకున్న మూడు పార్లమెంటు సీట్లలో ఒక్కరూ బీసీలు లేరు. 56 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్క బీసీలేడు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసిన అద్భుతమైన అభివృద్ధిని గురించి మాట్లాడకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడుపుతుంది. కాంగ్రెస్ తిట్ల దండకం రాజకీయాలతో గెలవాలని చూస్తున్నది. కేసీఆర్ అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయ నమూనాను చూపకుండా ఓట్లడిగితే ప్రజలెలా వేస్తా రు? బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందని అడిగితే, ఆ పథకాలు ప్రతి గడపకూ అందాయన్న విషయాన్ని ప్రజలు నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులేం జవాబు చెబుతారు? కాలం చెల్లిన విధానాలతో, బలహీనమైన సెక్యులర్ గొంతుతో కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడిని ఎదుర్కోవ డం కాంగ్రెస్ వల్లకాదు.
బీఎస్పీకి తెలంగాణలో బలమైన పునాదులు లేవు. ఈ స్వల్పకాలంలో పునాదులు తవ్వి, భవనాలు కట్టడం అంత సులభం కాదు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్కే పరిమితమైన ఆపార్టీ అక్కడ కూడా చాలా బలహీనపడింది. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వేలాది దళిత కుటుంబాలను చిన్న పారిశ్రామికవేత్తలుగా మార్చింది. దేశంలోనే అణగారిన జాతులుగా ఉన్న దళితుల విషయంలో ఇది అత్యద్భుతమైన పథకం. ఈ పథకం ఇలాగే మరో 7,8 ఏళ్లు కొనసాగితే దళిత సాధికారిత సాధ్యమవుతుంది.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వారా వేలాదిమం ది దళితులు, బీసీలు నాణ్యమై న విద్యను పొందుతూ ఈ దేశంలోనే కాక దేశ విదేశాల్లో రాణిస్తున్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, సచివాలయం ముం దు 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్విగ్రహాన్ని స్థాపించడం, దళితులు, బలహీనవర్గాల్లో ఎం తో స్ఫూర్తిని కలిగించే అంశాలు. సచివాలయానికి వెళ్ళే ప్రతివారూ రోజూ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించడం వల్ల వారిలో రాజ్యాంగస్ఫూ ర్తి, అణగారిన జాతుల ఆలోచనా విధానం అబ్బుతుంది. ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను నింపడం, రైతుబంధు, ఐటీరంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన, కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ పండుగ తదితర పథకాలన్నీ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. తెలంగాణ పథకాలు ప్రతి ఇంటి గడపనూ తాకుతున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే రోల్ మాడల్గా నిలుపుతున్నాయి.
వట్టి మాటలతో కాకుండా గట్టి చేతలతో సచివాలయాన్ని నిర్మింపజేయడం కేసీఆర్కే చెల్లింది. 33 జిల్లాలు చేసి మౌనంగా ఉండకుండా ప్రతిజిల్లాలో పూర్తి వసతులతో కలక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించడం, డబుల్ బెడ్రూం ఇండ్లను విడతలవారీగా నిర్మించి ఇండ్లులేని వారికివ్వడం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పెన్షన్లాంటి అనేక అపూర్వ పథకాలతో తెలంగాణ ప్రజల హృదయాలను జయించిన ఏకైక నాయకుడు కేసీఆర్.
తెలంగాణ మాడల్ను తమ రాష్ర్టాల్లో అమ లు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్న రాష్ర్టాలున్నాయి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను స్థాపించి పోటీ చేయబోవడం, ఇతర రాష్ర్టాల్లోనూ ఆ ప్ర యత్నం జరుగడం తెలంగాణకే గర్వకార ణం. పదమూడు సంవత్సరాలు మడమ తిప్పని పో రాటంతో తెలంగాణ సాధించి, ముఖ్యమంత్రిగానూ అనితర సాధ్యమైన పథకాలతో తెలంగాణలో మౌలిక మార్పులు తేవడానికి నిరంతర కృషి చేస్తున్న నాయకుడు కేసీఆ ర్. హైదరాబాద్ మహానగరా న్ని బెస్ట్ లివింగ్ ప్లేస్గా మార్చడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యా త మహానగరాల్లో ఒకటిగా మా రుస్తున్న కేసీఆర్ తన అద్భుతవ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ మూడవసారి కూడా గెలిచి తెల ంగాణ ముఖ్యమంత్రిగా హ్యాట్రి క్ సాధిస్తారన్నది వాస్తవం.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567