పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రాష్ట్రపతి భవన్కు ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. దీనికి ప్రతి గా.. పింఛన్ పెంపునకు నిధులు సరిపోవడం లేదని, ఈ విషయం బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ పరిశీలనలో ఉన్నదని కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు తెలిపారు. ఇప్పుడే కాదు, సింగరేణి ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించినప్పుడల్లా అధికారుల నుంచి ఇటువంటి సమాధానమే వస్తుండటం విచారకరం. పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులు తక్కువ మొత్తాలతో బతుకులను ఎల్లదీస్తున్నారు. వారికి వచ్చే పింఛన్ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కూడా సరిపోవడం లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఒంటరిగా జీవిస్తున్నట్టుగా భావిస్తుండటం సిగ్గుచేటు. వీరి దుర్భర పరిస్థితిని గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరం. కోల్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ పెంపుదల కోసం దేశంలోని వివిధ పింఛన్ సంఘాలు ఇటీవల కోల్ సెక్రటరీ, కోల్ ఇండియా చైర్మన్కు విజ్ఞప్తి లేఖలు అందించగా వారు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఏదేమైనప్పటికీ సింగరేణి ఉద్యోగుల క్లిష్ట పరిస్థితులను పరిశీలించి, గౌరవప్రదంగా జీవించేలా వారి పింఛన్ను తగినరీతిలో పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.
– ఆళవందార్ వేణుమాధవ్