చరిత్ర పుటలను పరిశీలిస్తే మానవజాతి అభివృద్ధి ప్రధానంగా నది పరీవాహక ప్రాంతాల్లోనే జరిగిందని మనకు అవగతమవుతుంది. సింధులోయ నాగరికత, నైలు నాగరికత, బాబిలోనియా నాగరికత మానవ అభివృద్ధి సూచికలకు ఉదాహరణలు. నీటి లభ్యత కారణంగా ప్రజల జీవన విధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయని చరిత్ర ఆధారంగా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో కరువును తరిమికొట్టి సస్యశ్యామలం చేసే దిశగా అపర భగీరథుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తిచేశారు.. దీని ద్వా రా లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బృ హత్తర ప్రణాళిక అమల్లోకి వచ్చింది. నాటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురై తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు నిరాదరణకు గురైతే ఉద్యమకారులే పాలకులు అయితే వారికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా లక్ష్యసాధన చేయవచ్చో నిరూపించారు మన సీఎం కేసీఆర్ .
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్థ్యం తో నూతన జలాశయ నిర్మాణానికి (ప్యాకేజీ 9 లో భాగంగా) ప్రతిపాదన జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. ఇక్కడ నీటి సౌకర్యం కరువై రైతన్నలు సాగు,తాగునీటి కోసం వా రి భూముల్లో ఎన్నో బోర్లు వేశారు. అనేక బోర్లు ఫెయి లై అప్పులపాలై అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ పంటలు ప్రధానంగా వర్షాలు, బావులపై మాత్రమే ఆధారపడి పండేవి. యువత ఉ పాధి కరువై ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. కల్లోలిత ప్రాంతం కావడం వల్ల గతంలో ఆంధ్ర పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపలేదు. ఈ పరిస్థితులన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించి పో యారు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేయడంతోపాటు రైతాంగ ఉపాధికి ఎత్తిపోతల పథకమే శరణ్యమని ప్రతిపాదించారు.
మల్కపేట వాస్తవ్యులు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కర్రోళ్ల నరసయ్య చా లా సందర్భాల్లో మాట్లాడుతూ పాలకులు మారినా ఈ ప్రాంత బతుకులు మారవని ఎత్తిపోతలు ఎప్పుడూ ఎన్నికల హామీగానే మిగులుతుందని దిగు లు చెందేవారు. ఏండ్లు గడిచిన ఆనా టి ఆంధ్ర పాలకులు ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద్యమ కాలం లో ప్రజల కష్టాలు ముఖ్యంగా రైతులకష్టాలు ప్రత్యక్షంగా చూసి చలించి పోయిన ఆనాటి ఉద్యమ నాయకులు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు స్వరాష్ట్రం లో సంక్షోభంలో కాకుండా సంక్షేమంలో బతకాలని కాళేశ్వర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.
కరువు నివారణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆనాడు రైతులు పడుతున్న బాధలు, యువత ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టడం చూసి వారికి శాశ్వతమైన పరిష్కారం లభించాలని మంత్రి కేటీఆర్ మల్కపేట జలాశయ సామర్ధ్యం 0.35 టీఎంసీల నుంచి 3 టీ ఎంసీలకు పెంచాలని నీటిపారుదల శాఖకు సూచించారు. జలాశయ సామర్థ్యం 3 టీఎంసీలకు పెంచడం వల్ల ఆయకట్టు పెరుగుతుందని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ భావించారు.
కేటీఆర్సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలతో జలాశయం సామర్థ్యం 3 టీఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టుకు రూ.553.10 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2017 నుంచి అనే క సందర్భాల్లో ప్రాజెక్టు పనులను పరిశీలించి తొందరగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడంలో కేటీఆర్ చేసిన కృషి హర్షనీయం.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 9లో భాగంగా నిర్మా ణం పూర్తి చేసుకున్నది మల్కాపేట్ జలాశయం. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపే ట్, ముస్తాబాద్, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాల్లో దాదాపు 60 వేల ఎకరాల మెట్ట భూమి ఈ రిజర్వాయర్ ద్వారా మాగాణి గా మారనున్నది. భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయ,అనుబంధ రం గాలైన మత్స్యపరిశ్రమ, పాడి పరిశ్రమ, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నవి.
మల్కపేట్ రిజర్వాయర్ పూర్తి కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వ రలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
పాకాల శంకర్ గౌడ్
98483 77734