న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కొనసాగుతుండగా 24 ఏండ్ల మహిళ హనుమాన్ చాలీసా చదివారు. దవాఖానాలోని న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంటల పాటు ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్ను తొలగించేవరకూ ఆమె స్ప్రహలోనే ఉన్నారు. తనకిష్టమైన హనుమాన్ చాలీసాను ఆలపించారు.
జులై 23న జరిగిన ఈ ఘటనను డాక్టర్ దీపక్ గుప్తా వివరించారు. మహిళకు అనస్తీషియాతో పాటు పెయిన్కిల్లర్ మందులు ఇచ్చామని చెప్పారు. ఆపరేషన్ రూమ్లో మహిళ వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆమె హనుమాన్ చాలీసా ఏకబిగిన చదువుతుండగా దీపక్ గుప్తాతో పాటు న్యూరో అనస్తీషియా బృందం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగిందని ట్వీట్లో వెల్లడించారు.