75th independence day | స్వాతంత్య్ర సంగ్రామంలో ఆది నుంచి కీలక పాత్ర పోషించిన గ్రామమది ! సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీషర్లపై దాడి చేసి పోరాటయోధులను విడిపించిన ఊరు అది !! ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ.. తెల్ల దొరల కాళ్ల కింద తలొగ్గమని ఎదురు నిలిచిన పల్లె అది!! కానీ స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి 71 ఏండ్ల పాటు అక్కడ సంబురాలు జరగలేదు. మూడేండ్ల క్రితం వరకు జాతీయ జెండానే ఎగురవేయలేదు !! అదేంటి? స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఊళ్లో స్వాతంత్య్ర వేడుకలు జరగకపోవడమేంటి అని అనుకుంటున్నారా !! దాని వెనుక ఒక కారణం ఉంది..
స్వాతంత్య్ర సంగ్రామంలో హర్యానాలోని భివానీ జిల్లాలోని రోహ్నాత్ గ్రామం కీలక పాత్ర పోషించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో రోహ్నాత్ గ్రామస్థులు.. హిసార్ జైలును ధ్వంసం చేసి అక్కడ బందీలుగా ఉన్న స్వాతంత్య్ర పోరాట యోధులను విడిపించారు. ఈ ఘటనలో 11 మంది బ్రిటీష్ అధికారులు మరణించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం.. రోహ్నాత్ గ్రామాన్ని చుట్టుముట్టింది. దొరికిన వారిని దొరికినట్టుగా ఓ చెట్టుకు ఉరితీశారు బ్రిటీష్ అధికారులు. మొత్తానికి విధ్వంసం సృష్టించారు. ప్రాణభయంతో స్త్రీలు, పిల్లలు బావిలోకి దూకేశారు. విధ్వంసకాండ తర్వాత ప్రాణాలతో మిగిలిన గ్రామస్థులను క్షమాపణ చెప్పాలని బ్రిటీష్ అధికారులు బెదిరించారు. కానీ ఆ గ్రామస్థులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో రోహ్నాత్ ఊరిని తిరుగుబాటుదారుల ఊరుగా ప్రకటించారు. ఆ ఊరిలోని 21వేల ఎకరాల భూమిని వేలం వేసి పొరుగు ప్రాంతాల వారికి అమ్మేశారు. అయితే ఈ ఘటనలో ప్రాణత్యాగం చేసిన వారిని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తామింకా బానిసలుగానే ఉన్నామని, అప్పటి తిరుగుబాటుదారుల వారసలుకు ఇంకా తమ భూమి మీద హక్కు రాలేదని వారు ఆవేదన చెందారు. తమ పూర్వీకుల త్యాగాలను గుర్తింపు దక్కలేదని 71 ఏండ్ల పాటు స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉన్నారు. అయితే 2018 మార్చి 23న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రోహ్నాత్ గ్రామంలోని స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి తొలిసారి జాతీయజెండాను ఎగురవేశారు.
Independence day special | 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
Independence Day Special |భారత్ నుంచి బ్రిటీషోళ్లు ఎంత సంపద దోచుకెళ్లారు
1947 నుంచి ప్రతి రోజు ఎగురుతున్న జాతీయ జెండా
Independence day Celebrations | మువ్వన్నెల మురిపాలు