రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసారిగా జాతీయ జెండాను గ్రామ నడిబొడ్డున ఆవిష్కరించి సంబురాలు జరుపుకోన్నారు.
అప్పటి నుంచి గ్రామస్తులు ఆ అనవాయితీని కొనసాగిస్తుండడంతో నాడు ఎత్తిన జెండా నేటికి దించకుండా ఏడున్నర దశాబ్దాలుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. ప్రతి ఏడాది ఘనతంత్ర, స్వాతంత్ర, దసరా వేడుకల సమయంలో పాత జెండాను మార్చి కొత్త జెండాను ఆవిష్కరిస్తూ నేటికి జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు ఆ గ్రామస్తులు.