హైదరాబాద్: సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్లైన్ వేదికగా రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభయ్యింది. 34 దేశాల్లోని 45 సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో సామవేదం షణ్ముఖ శర్మ, గరిపాటి నరసింహారావు, ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్, సినీ నటుడు మురళీ మోహన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
లింక్: https://youtu.be/7X3xkO1SLRM,
https://www.facebook.com/SriSamskrutikaKalasaradhi/events/