టొరంటో: కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చదివి, కొత్త సంవత్సర రాశి ఫలితాలను వివరించారు. అనంతరం తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి మాట్లాడుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 కష్టకాలంలో తాకా చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యాక్రమంలో పాల్గొని విజయంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల తదితరుల పాటలు, నృత్యాలు అందరిని ఉత్తేజపరిచాయి.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ సభ్యులు బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..