వంశీ వేగేశ్న సంస్థల సేవలు ప్రశంసనీయమని “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రతినిధి రాధిక మంగిపూడి ప్రశంసించారు. గురువారం ఉదయం ఆమె ఘంటసాల ఆలయంలో జ్యోతి ప్రజ్వలనంతో దీపావళి ఉత్సవాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ వేగేశ్న ఫౌండేషన్ & వంశీ ఆశ్రమాన్ని ప్రముఖ రచయిత్రి, అంతర్జాతీయ కార్యక్రమాల వ్యాఖ్యాత రాధిక మంగిపూడి, లో రియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చైన్ డైరెక్టర్ మంగిపూడి సాయి ప్రకాష్ దంపతులు సందర్శించారు. ఈ సంస్థ గత మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా దివ్యాంగులకు, వృద్ధులకు, పేద కళాకారులకు అందిస్తున్న సేవలను ఎంతో ప్రశంసించారు.
ముఖ్యంగా ఒకే ప్రదేశంలో దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, వారికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయించడం ఎంతో ఉదాత్తమైనదన్నారు. ఈ సేవలకు తామూ సహకరిస్తామన్నారు. నిర్వాహకులకు రాధిక మంగిపూడి, మంగిపూడి సాయి ప్రకాష్ దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ ప్రశాంత ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం, షిరిడి సాయి దేవాలయం, ఘంటసాల స్మృతి మందిరం దర్శించుకుని కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులిద్దరినీ, వంశీ వేగేశ్న సంస్థల అధ్యక్షులు శిరోమణి వంశీ రామరాజు, వంశీ మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ ఆలయ మర్యాదలతో సత్కరించారు. తమ సేవా కార్యక్రమాలలో విదేశాల్లోని వివిధ తెలుగు సంస్ధల ప్రతినిధులు సహకరించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని వంశీ రామరాజు ఆనందం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mukesh Ambani @ London | లండన్లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!