తెలంగాణ కల్చరల్ సొసైటీ- సింగపూర్ ( TCSS ) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా జూమ్ యాప్ ద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్నగర్కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ ఆన్లైన్లో ఈ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో చాలామంది భక్తులు ఇంటి నుంచే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీర్వాదం పొందారు. సకల విఘ్నాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు తమపై ఉండాలని, ప్రపంచాన్ని కరోనా బారి నుంచి కాపాడాలని ఈ సందర్భంగా భక్తులు వినాయకుడిని కోరుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు.
సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకటరమణ, ఇతర కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి మరియు కాసర్ల శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష పరిహారం ఎలా చేసుకోవాలి?
వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?
Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..