అమెరికా : కరోనాతో మృతి చెందిన మధుర గాయకుడు జి ఆనంద్కు ఏడు దేశాల నుంచి పలువురు ప్రముఖులు ఆనంద్కు అంతర్జాలంలో నివాళులర్పించారు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి ‘స్వరమాధురి’ సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500కుపైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారని ఆనంద్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆనంద్ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయం అందక మరణించిన తీరు బాధాకరమన్నారు. కళాకారుల జాతి సంపదని వారిని కాపాడు కోవాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉందని పలువురు పేర్కొన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా, శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలో హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు.
న్యూ జెర్సీ నుంచి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు.
ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్ , ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర, మాధవ పెద్ది సురేష్, ఆర్పీ పట్నాయక్, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు , డా నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా ఆళ్ల శ్రీనివాస్ , శారద సింగిరెడ్డి, రవి కొండబోలు, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్, హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం, సురేఖ మూర్తి దివాకర్ల, జీవీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ గారితో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమాన్ని సంతోషం ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెల్, సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లైవ్ ప్రసారం చేశాయి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి