భీమ్గల్/ఏర్గట్ల, సెప్టెంబర్ 20: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్రెడ్డికి మద్దతుగా ఉంటామంటూ కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. భీమ్గల్ మండలంలోని ముచ్కూర్కు చెందిన శాలివాహన కుమ్మరి సంఘం(56 మంది సభ్యులు), మేదరి సంఘం (76), మున్నూరుకాపు సంఘం-ఏ1 (35), మత్స్యపారిశ్రామిక సంఘం (80), యాదవ సంఘం(54), పద్మశాలీ సంఘం (26), పల్లికొండకు చెందిన గంగం సంఘం(35), చిన్న ఎనుపోతుల సంఘం(44), గొల్లకుర్మ సంఘం(40), పరిపూర్ణానంద సంఘం (46 మంది సభ్యులు), ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన క్రైస్తవులు మంత్రికి మద్దతుగా తీర్మానం చేశారు. చందూర్ మండలం ఘన్పూర్ ఎస్సీ సంఘం సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డివెంటే ఉంటామంటూ తీర్మానం చేసి కాపీని సభాపతికి అందజేశారు.