వర్ని, నవంబరు 14 : పలువురు నాయకులు డబ్బు కోసమే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వర్ని మండలం జాకోర, కూనిపూర్, వెంకటేశ్వర క్యాంపు, జలాల్పూర్, సైద్పూర్, పులి క్యాంపు, రాజ్పేట, శంకోర తదితర గ్రామాల్లో మంగళవారం పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయనకు గ్రామాల్లో మహిళలు మంగళహారతులు ఇస్తూ.. ప్రజలు బాణాసంచా కాలుస్తూ.. పూల వర్షం కురిపిస్తూ.. స్వాగతం పలికారు. జాకోర గ్రా మంలో బోయిలు చేపల వలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోనే ఓటమి పాలైన రవీందర్రెడ్డి ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. డబ్బుతో ఇక్కడ గెలుస్తానన్న ధీమాతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ల దగ్గరకు వస్తున్నాడన్నారు. పలువురు నాయకులు ఆ డబ్బుకు ఆశపడి పార్టీలు మారుస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. తాను ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకొని పరిష్కారం చేశానన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానన్నారు. ప్రచారంలో పోచారం రవీందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఏఎంపీ వైస్ చైర్మన్ గోపాల్, సర్పంచులు గోదావరి, అనితావెంకాగౌడ్, రేణుక, ఎంపీటీసీ సభ్యురాలు సాయిలు, సావిత్రి, సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గంగారాం, బీఆర్ఎస్ నాయకులు వీర్రాజు, గిరి, సాయిలు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్/రుద్రూర్/బాన్సువాడ/ కోటగిరి/నస్రుల్లాబాద్/బాన్సువాడ టౌన్, నవం బర్ 14 : పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఇం టింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్, తాడ్కో ల్, బోర్లం, కొల్లూరు, హన్మాజీపేట్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడలోని ఒకటో వార్డులో నాయకులు ప్రచారం నిర్వహించారు. పొతంగల్ మండ లం హంగర్గా, సుంకిని గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మండల నాయకులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్, మైలారం, నాచుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుల ఆధ్వర్యంలో నాయకులు జోరుగ ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చందూర్ మండలం ఘన్పూర్లో కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణాగౌడ్, సర్పంచ్ దాసరి గంగారాం, సాయగొండ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కేవలం పోచారం శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని డీసీసీబీ చైర్మన్
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారానికి మద్దతుగా బాన్సువాడలోని 9, 11వ వార్డుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి డీసీసీబీ చైర్మన్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. మరోమారు బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, స్థానిక కౌన్సిలర్లు లింగమేశ్వర్, రవీందర్రెడ్డి, వెంకటేశ్, రమాదేవి, కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పట్టణం మహిళా అధ్యక్షరాలు అనిత, ప్రధాన కార్యదర్శి ప్రతిమారెడ్డి, యూత్ అధ్యక్షుడు యూనూస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలోని 16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్లు రమేశ్, బీఆర్ఎస్ నాయకులు ఉదయ్, రాజశేఖర్, అబ్బయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.