డిచ్పల్లి / ఖలీల్వాడి, డిసెంబర్ 29 : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన జైడి రఘుపతిరెడ్డి.. తన తండ్రి దివంగత జైడి సాయన్న జ్ఞాపకార్థం స్వర్గరథాన్ని గురువారం వితరణ చేశారు. స్వర్గరథాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించి, దాతను అభినందించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో అర్గుల్ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని, పారిశుద్ధ్యం, హరితహారం, అన్ని కార్యక్రమాలు బాగున్నాయని సర్పంచ్, ఉపసర్పంచ్ పద్మ, రాజేందర్, పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామంలో ఓపెన్జిమ్ నిర్మించేందుకు కలెక్టర్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. శవాలను భద్రపరిచే ఫ్రీజర్ను అందజేసేందుకు ఏనుగు నర్సారెడ్డి ముందు వచ్చారు. ఆయనను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డీపీవో జయసుధ, జక్రాన్పల్లి ఎంపీపీ కుంచాల విమలారాజు, మండల ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో యూసుఫ్ఖాన్ పాల్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
డిచ్పల్లి, డిసెంబర్ 29: డిచ్పల్లి నుంచి అర్గుల్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. లోపాలు ఉన్న వాటిని గమనించి సరిచూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డిచ్పల్లి ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో కిషన్రావు, ఏపీవో సుధాకర్రెడ్డి, ఎఫ్ఆర్వో హిమచందన, హైవే సిబ్బంది ఉన్నారు.