బోధన్ రూరల్ : వినాయక నిమజ్జనం కోసం వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నాగన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బోధన్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దమ్మన్న (32) అనే యువకుడు వినాయక నిమజ్జనం కోసం గ్రామ శివారులోని వాగుకు వెళ్లారు. వినాయకుడి ప్రతిమను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడిపోయి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ దవాఖానకు తరలించినట్లు వెల్లడించారు.