బీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి వివిధ గ్రామాల ప్రజలు శనివారం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని మూకుమ్మడిగా తీర్మానించారు. ఈ మేరకు తీర్మాన కాపీలను స్పీకర్కు, బీఆర్ఎస్ నేతలకు అందజేశారు.
మోర్తాడ్/భీమ్గల్/ బాల్కొండ, సెప్టెంబర్ 9: బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కుల సంఘాల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నాలుగు సంఘాలు, భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో గంగపుత్ర వడ్డెర సంఘం సభ్యులు, బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన మూడు కుల సంఘాల నుంచి 64 కుటుంబాలు.. మంత్రికి మద్దతు తెలుపుతూ శనివారం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులకు తీర్మాన కాపీలను అందజేశారు. దోన్పాల్ గ్రామంలో గంగపుత్రసంఘం(41మంది), యాదవ సంఘం(35), హరిజనసంఘం(30), మాలసంఘం (20) వారు మంత్రికి రానున్న ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన కాపీలను స్థానిక సర్పంచ్ పర్సదేవన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవన్న, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్కు అందజేశారు. చేంగల్ గ్రామంలో గంగపుత్ర వడ్డెర సంఘ సభ్యులు తీర్మాన కాపీని ఎంపీపీ ఆర్మూర్ మహేశ్కు అందజేశారు.
బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన సరికెల వారి మున్నూరుకాపు సంఘం నుంచి 28 కుటుంబాలు ,ఆదివాసీ నాయక్పోడ్ సంఘం నుంచి 22 కుటుంబాలు, విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి 14 కుటుంబాలు మొత్తం 64 కుటుంబాలు తీర్మాన కాపీని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా కులసంఘాల సభ్యులు మాట్లాడుతూ.. తమ గ్రామంతోపాటు బాల్కొండ నియోజకవర్గంలో ఏనాడు ఏ నాయకుడు చేయని అభివృద్ధి పనులు మంత్రి వేముల చేశారని తెలిపారు. దోన్పాల్ గ్రామానికి ఊహించని విధంగా సబ్స్టేషన్ను మంజూరు చేసిన మంత్రికి తామంతా మద్దతుగా నిలువాలనుకున్నామని చెప్పారు. గతంలో దోన్పాల్ గ్రామాన్ని పట్టించుకున్న వారే లేరని. స్వరాష్ట్రంలో గ్రా మాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన ప్రశాంత్రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. దోన్పాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పర్సగంగన్న, లింగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. చేంగల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ చిన్నారెడ్డి, బీఆర్ఎస్నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నాగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ పెంటు లిం బాద్రి, ఎంపీటీసీ నారాయణ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎంబరి నర్సయ్య, ఉపసర్పంచ్ ఎంబరి మహిపాల్, నాయకులు పోలేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ నల్లూర్ చిన్నయ్య, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రుద్రూర్, సెప్టెంబర్ 9: వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని రుద్రూర్ మండల రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సంఘాలు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ మేరకు తీర్మాన కాపీని బాన్సువాడలో స్పీకర్ను కలిసి అందజేశాయి. ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందారని తెలిపారు. ప్రతి కుల సంఘాల అభివృద్ధికి కృషిచేశారని పేర్కొన్నారు. గ్రామంలో రూ. 8 కోట్లతో పనులు చేపట్టారని గుర్తుచేశారు. పోచారం లాంటి నాయకుడు ఉంటే గ్రామాలే కాదని, రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి బాలరాజు, దయాల లక్ష్మణ్, గోరెబాబు, రఘు తదితరులు ఉన్నారు.