సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిదువులకు పసుపు, కుంకుమ ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాంబూలంతో కూడిన వాయినం ఇచ్చారు. వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని ఆలయాలు కిటకిటలాడాయి.