బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్/బాన్సువాడ/కోటగిరి/మోస్రా (చందూర్), నవంబర్ 2 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రజలు ఆదరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బుడ్మి, బోర్లం సొసైటీ అధ్యక్షుడు గంగుల గంగారాం, సంగ్రాం నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి జోరుగా ప్రచారం చేస్తున్నారు. సంగెం గ్రామంలో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ హోటల్లో చాయ్ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, నస్రుల్లాబాద్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేశ్, నాయకులు ప్రతాప్ సింగ్, మోహన్, కలీల్, మైశాగౌడ్, సాయిలు, అజ్గర్ అలీ, నర్సింహులు గౌడ్, ఇమ్రాన్, రాంబాబు, సాయి, మామిడి భూమ య్య, అంబం సాయిలు తదితరులు ఉన్నారు. బాన్సువాడతోపాటు మండలంలోని సోమేశ్వర్, తిర్మలాపూర్, కోనాపూర్, బుడ్మి, నాగారం, రాంపూర్, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నాయిని మొగులయ్య, సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీనివాస్, బయ్యల కృష్ణ, మొగులయ్య, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి కోటగిరి మండలంలో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. మోస్రా మండల కేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బూత్ లెవల్ కన్వీనర్ దేవేంద ర్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ అలీం, యూసుఫ్, కలీమ్ తదితరులు పాల్గొన్నారు.