నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అబ్బాపూర్ సమీపంలో గుర్తుతెలియని నలుగురు బస్సుపై రాళ్లదాడి చేశారు. అయితే ప్రయాణికులు ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.