కామారెడ్డి/ వినాయక్నగర్, జనవరి 19: కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ బృందం శుక్రవారం అరెస్టు చేసింది.
నిందితుల నుంచి సుమారు రూ.5లక్షల విలువ చేసే 900 గ్రాముల నార్కోటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారు ఉపయోగించిన రెండు బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐలు వెంకటేశ్, స్వప్న, ఎస్సై రాజ్ కుమార్, సిబ్బంది శ్రీను, ప్రసాద్, ఉత్తం, భోజన్న, విష్ణు, అవినాశ్, రామ్ బచ్చన్ పాల్గొన్నారు.