నిజాంసాగర్, మే 24 : కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. మండలంలోని కొమలంచ, మహ్మద్నగర్, మాగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించా రు. అనంతరం నర్సింగ్రావ్పల్లి చౌరస్తాలో లారీల కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టును సందర్శించిన అనంతరం మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు ఎక్కడ కూడా లారీల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు, వీఆర్ఏలతో కలిసి చెక్పోస్టులను ఏర్పా టు చేసి లారీలను మళ్లిస్తున్నామని అన్నా రు. మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సైతం లారీల కొరత తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తూకాలు, గన్నీ బస్తాలు, లారీలు తదితర ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు ఉన్నారు.