ఇందల్వాయి, జనవరి 9 : ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్స్టేషన్ లాకప్లో ఉంచి విచారిస్తున్నారు. మంగళవారం ఒక దొంగ బాత్రూమ్కు వెళ్లి బయటికి రాలేదు. అనుమానంతో పోలీసులు పరిశీలించగా బాత్రూం కిటికీ అద్దాలు ధ్వంసమై కనిపించాయి.
దీంతో దొంగ తప్పించుకున్నట్లు నిర్ధారించుకొని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పారిపోయిన దొంగ కోసం జాతీయ రహదారి పక్కనున్న హోటళ్లు, ముళ్లపొదలను పరిశీలించారు. సీఐలు, ఎస్సైలు సిబ్బందితో బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చెక్పోస్ట్లు, టోల్ప్లాజా, పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఏసీపీ కిరణ్కుమార్ డిచ్పల్లి ఠాణాకు వచ్చి ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.