సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్’ పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో 41 చోట్ల చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.171.87 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 26 పూర్తికాగా మరో 15 పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో రెండు పంటలకు సాగు నీరు అందడమే కాకుండా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సైతం చెక్డ్యాంలు అన్నదాతకు భరోసాగా నిలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం ఉబికి వస్తుండడంతో సాగునీటికి రందిలేకుండా పోయింది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో 5 చెక్డ్యాంలు, ఎల్లారెడ్డిలో 18, బాన్సువాడలో ఒకటి, జుక్కల్ నియోజకవర్గంలో రెండు చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తికాగా మిగితా ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.
నిజాంసాగర్, జూలై 2 : వృథా నీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు భూగర్భజలాల పెంపు కోసం నిర్మించిన చెక్డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. నాన్ కమాండ్ ఏరియాలో సైతం పంట లు పుష్కలంగా పండేలా, వాగులు, నదుల్లో నీరు నిలిచి ఉండేలా సాగు నీటి సరఫరాకు నిర్మించిన చెక్డ్యాంలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో రూ.171.87 కోట్లతో 41 చెక్డ్యాంలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కిందట వీటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో 5 చెక్డ్యాంలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 18 చెక్డ్యాంలు, బాన్సువాడ నియోజకవర్గంలో ఒకటి, జుక్కల్ నియోజకవర్గంలో రెండు చెకడ్యాం నిర్మాణాలు పూర్తికాగా మిగితా ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.
జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో 2 జుక్క ల్ నియోజకవర్గంలో 12, కామారెడ్డి నియోజకవర్గంలో 5, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22 మొ త్తం 41 చెక్డ్యాంలకు రూ.171.87 కోట్లు మం జూరు కాగా వాటిలో 26 చెక్డ్యాంలు పూర్తయ్యా యి. మిగిలిన 15 చెక్డ్యాంలో పురోగతిలో ఉన్నాయి. వాటిలో
చెక్డ్యాంలు, వాగులు, నదులతో పాటు మంజీర పరీవాహక ప్రాంతం జలకళను సంతరించుకున్నది. ప్రస్తుతం వర్షాల జాడ లేకపోయినా నాన్ కమాండ్ ఏరియాలో చెక్డ్యాంలు, నదుల కింద గల రైతన్నలు వానకాలం పంటల సాగులో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మంజీర పరీవాహక ప్రాంతంతో పాటు చెక్డ్యాంల కింద వర్షాలు లేనప్పటికీ నిండు కుండలా దర్శనమిస్తుండడంతో రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేస్తున్నారు. వరి నాట్లు వేయడం, దుక్కులు దున్నుకోవడంలో రైతన్నలు ముందుకు సాగుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా గ్రామ శివారులో సంవత్సరం కిందట చెక్డ్యాం నిర్మించడంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటితో నిండి ఉంది. దీంతో వర్షాల జాడ లేనప్పటికీ నాలుగు రోజుల కిందటే వరి నాట్లు వేసుకున్నాను. చెక్డ్యాంల నిర్మాణం మంచి ఫలితాలను ఇస్తున్నది. బోరు బావి లేకపోవడంతో చెక్డ్యాంలో నిలువ ఉన్న నీటితో నాట్లు వేసుకున్నాను. లేదంటే వర్షంపై ఆధారపడి పంటలను సాగు చేసేవాడిని.
-కృష్ణారెడ్డి, రైతు, అన్నాసాగర్, ఎల్లారెడ్డి మండలం
మంజీర ప్రస్తుతం జలకళను సంతరించుకున్నది. లేదంటే వర్షాలు కురియడం, నిజాంసాగర్ నీటిని విడుదల చేయడం, ఎగువ భాగంలో వర్షాలు కురుస్తేనే మంజీరలో నీటి జాడలు కనిపించేవి. అలాంటిది మంజీరలో చెక్డ్యాం నిర్మించడంతో ప్రస్తుతం మద్దెల్చెరువు వద్ద మంజీర ప్రాంతం జలకళను సంతరించుకున్నది. యాసంగి, వానకాలం పంటలకు ఢోకా లేదు.
-సురేశ్రావ్, రైతు, మద్దెల్చెరువు, పిట్లం మండలం
చెక్డ్యాంల నిర్మాణం చేపట్టడంతో సత్ఫలితాలు వస్తున్నా యి. ప్రస్తుతం వర్షాలు లేనప్పటికీ చెక్డ్యాంలు, మంజీర పరీవాహక ప్రాంతంలో నాన్కమాండ్ ఏరియాలో ఉన్న రైతులు సైతం వరి సాగులో నిమగ్నమయ్యారు. ఒక్కో చెక్ డ్యాం కింద 350 నుంచి 400 ఎకరాల వరకు సాగు భూములు ఉన్నాయి. జిల్లాలో 41 చెక్డ్యాంలకు నిధులు మంజూరు కాగా వాటిలో 26 చెక్డ్యాంల పనులు పూర్తయ్యాయి ప్రస్తుతం ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నాయి.
– శ్రీనివాస్, నీటి పారుదల శాఖ ఎస్ఈ