కంఠేశ్వర్, ఫిబ్రవరి 1: పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఐదేండ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు మాజీలుగా మారారు. వారి స్థానంలో అధికారులు పగ్గాలు చేపటార్టు . 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు జరుగగా, ఫిబ్రవరి 1న పాల కవరాల్గు కొలు వుదీరాయి. అయితే, జనవరి 31తోనే వాటి పదవీకాల ం ముగిసింది. గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం ఆసకి ్తచూప లేదు. కొత గ్తా ఏర్పడిన కాం గ్రెస్ సర్కా రు.. సాన్థి క సంసల్థ ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేక అధికారుల పాలనకే మొగ్గు చూపింది. ఘనంగా వీడ్కోలు.. నిజామాబాద్ జిలాల్లో 530 గ్రామ పంచాయ తీలు, కామా రె డి ్డ జిలాల్లో 526 పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీలకు ఐదేండ్ల క్రితం ఎన్నికైన పాలకవర్గాలు ప్రజలకు విశేష సేవలందించాయి. కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాయి.
కొన్నిగ్రామాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగినా అభివృద్ధి పనులు మాత్రం ఆగలేదు. పారిశుద్ధ్యం, రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు ఇలా సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల్లో పాలకవర్గాలపై మంచి అభిప్రాయం ఏర్పడింది. దీంతో పదవి దిగిపోతున్న సర్పంచ్లు, వార్డుమెంబర్లకు ఘనంగా సన్మానాలు చేస్తున్నారు. స్పెషలాఫీసర్ల బాధ్యతల స్వీకరణ.. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం, పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. పల్లె పాలన బాధ్యతలను ప్రత్యేక అధికారులకు కట్టబెట్టింది. తహసీలార్దు ,్ల ఎంపీడీవోలు , ఎంఈవోలు , వ్యవసాయ అధికారు లు, మండల పంచాయతీ అధికారులు.. ఇలా మండల స్థాయి అధికారులకు పల్లెల బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అటు కామారెడ్డిలో కూడా ఇలాగే ప్రత్యేక అధికారులను నియమించారు. సర్పంచ్లు దిగిపోతుండడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులు కొందరు బాధ్యతలు చేపట్టారు. మరికొందరు రేపు, ఎల్లుండి పల్లెల పాలనను చేపట్టనున్నారు.