నిర్మల్, జూన్ 4(నమస్తే తెలంగాణ): నిర్మల్ సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నివాసంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి కుటుంబ సభ్యులు కేసీఆర్కు తిలకం దిద్ది స్వాగతించారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న ముఖ్యమంత్రి 4.45 గంటలకు నిర్మల్-ఖానాపూర్ ప్రధాన రహదారి పక్కన కొండాపూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకొని రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు సమర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డిని స్వయంగా అధ్యక్షుడి సీటులో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆధునిక హంగులతో, సువిశాల స్థలంలో నిర్మించిన కార్యాలయాన్ని చూసిన సీఎం.. చాలా బాగుందని కితాబిచ్చారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, జోగురామన్న, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, దివాకర్రావ్, దుర్గం చిన్నయ్య, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, కోవలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం 5.25 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లా అధికారులను పరిచయం చేశారు. కొత్త కలెక్టరేట్లో పూజారులు ప్రత్యేక పూజలు చేయగా, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గుమ్మడికాయ కొట్టారు. అక్కడికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కట్ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణం నుంచే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.166 కోట్ల నిధులతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. చించోలి సమీపంలో రూ.20కోట్లతో నిర్మించిన మైనారిటీ స్కూల్ కాంప్లెక్స్ను సీఎం ప్రారంభించారు. వీటితో పాటు రూ.2కోట్లతో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న బంజారా భవన్కు సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం కలెక్టర్ చాంబర్ను సందర్శించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. చాంబర్లో కలెక్టర్ వరుణ్రెడ్డిని కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రజలకు ఉత్తమ సేవలందించాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రిని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఘనంగా సన్మానించారు. కలెక్టర్ చాంబర్ నుంచి బయటికి వచ్చి ఆవరణ మొత్తాన్ని సీఎం తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ జిల్లా ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పని చేసి రాష్ర్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావు, జోగురామన్న, బాల్క సుమన్, ఆత్రం సక్కు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలా చారి, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఇక్కడికి సమీపంలోనే ఉన్న సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలో 196 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు త్వరలో పట్టాలు ఇచ్చి, వచ్చే సీజన్ నుంచే రైతు బంధు అందజేస్తామని ప్రకటించారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మమ్మల్ని ఆశీర్వాదించాలని ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తరువాత మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించడం సంతోషంగా ఉందన్నారు.