నిండుకుండలా ఉన్న చెరువులు విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ రకాల పక్షులు చెరువుల్లో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి. చిట్టి చేపలను వేటాడుతూ, ఆకాశంలో విహరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారెగాం తండాలోని చెరువులో వలస పక్షుల కోలాహలం ఇది.