నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు కొనసాగుతున్నాయి. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ, బ్రాహ్మణ్పల్లి, కేశ్పల్లి, మనోహరబాద్ గ్రామాల్లో మంగళవారం ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్రావు, ఖలీమ్ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు. కేశ్పల్లిలో దరఖాస్తుల స్వీకరణను డీపీవో జయసుధ పరిశీలించారు. ధర్పల్లి మండలం దుబ్బాక, రేకులపల్లి, నడిమితండా, కోటాన్పల్లి గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించినట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట, మల్కాపూర్ తండా, రాంనగర్, తిర్మన్పల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగాయి. కొత్తపేట, మల్కాపూర్ తండాల్లో సభల నిర్వహణ తీరును ఎంపీడీవో మల్లేశ్ పరిశీలించారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని నల్లవెల్లి, స్టేషన్ తండా, గౌరారం, కృష్ణ తండా, సుద్దపల్లి, సాంపల్లి తదితర గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా, ఎంపీడీవోలు రాములునాయక్, గోపీబాబు పర్యవేక్షించారు. గన్నారం గ్రామంలో బుధవారం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్గౌడ్ తెలిపారు.
భీమ్గల్ మండల కేంద్రంతోపాటు బడా భీమ్గల్, చేంగల్, ఎంజీ తండా, రూప్లాతండాలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు గాండ్లపేట్ గ్రామంలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను జడ్పీ సీఈవో గోవింద్ పరిశీలించారు. దరఖాస్తులను ఈనెల 6 వరకు స్వీకరించాలని అధికారులకు సూచించారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, అడవి మామిడిపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలను ఆర్డీవో వినోద్కుమార్ పరిశీలించారు. ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాలను ఎంపీడీవో కర్నె రాజేశ్ ఎంపీవో శివచరణ్తో కలిసి పరిశీలించారు. సాలూరా మండలం ఖాజాపూర్, బోధన్ మండలం ఎరాజ్పల్లి గ్రామంలోని ప్రజాపాలన కార్యక్రమాన్ని తహసీల్దార్ మల్లయ్య ప్రారంభించారు.