Jeevan Reddy | ఆర్మూరుటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ధర్నా చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ అంటేనే మోసమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన పెట్టారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు హరిగోస పడుతున్నారని విమర్శించారు.
ఎన్నికలు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సరికాదన్నారు. మాయ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఆయన చేసిన అభివృద్ధితో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమం లబ్ధి చేసింది ఏమీ లేదన్నారు.