నిజామాబాద్ రూరల్/ మోపాల్ (ఖలీల్ వాడి), డిసెంబర్ 29 : తెలంగాణలో జరుగుతు న్న అభివృద్ధిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం జీర్ణించుకోలేక, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంతోపాటు మోపాల్ మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రభు త్వ రంగ సంస్థలను బడాబాబులకు అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. దీంతో ఆ సంస్థల్లో విధులు నిర్వహించే వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడుతున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలపై అన్ని వర్గాల ప్రజలు విసుగు చెంది ఉన్నారని అన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఆశించిన అభివృద్ధి చేయకుండా దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని అన్నారు.
ప్రస్తుతం మన దేశ అప్పును రూ.147 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని బాజిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ పార్టీ అవతరించాల్సిన అవసరం ఉన్నదని భావించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని వివరించారు. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు ఆయా రాష్ర్టాలకు చెం దిన నాయకులు.. సీఎం కేసీఆర్ను కలిసి మద్దతు పలుకడమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొం దుతున్న వారందరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు.
అర్వింద్ ఒక్కరూపాయి తీసుకురాలేదు..
బీజేపీ నాయకులు మాటలకే పరిమితమని బాజిరెడ్డి విమర్శించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటి వరకు జిల్లాకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏ ర్పా టు చేసిన కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, ఎంపీపీ అనూష ప్రేమ్దాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, సీనియర్ ఎంపీటీసీ అంకల గంగాధర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్, కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, కోర్వ లలితా గంగాధర్, యమునా అనిల్, బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్దాస్నాయక్, ప్రకాశ్ నాయక్, గోపాల్నాయక్, అక్బర్, స్వామి, సుభాష్, విజ య్, పవన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మోపాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, ఎంపీపీ లతా కన్నీరాం, జడ్పీటీసీ కమలా నరేశ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచులు ముత్యంరెడ్డి, సిద్ధార్థ, ప్రసాద్, రవి, సాయిరెడ్డి, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు చంద్రశేఖర్రెడ్డి, ఉమాపతిరావు, నిమ్మల మోహన్రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.