రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి. దీంతోపాటు పశుగ్రాసానికి డిమాండ్ నెలకొన్నది. కర్ణాటక రాష్ట్రంలో పశుగ్రాసం కొరత ఏర్పడడంతో అక్కడి పాడి రైతులు సరిహద్దు ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. కర్ణాటకలో వరి సాగు తక్కువగా ఉండడంతో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నదని, దీంతో తెలంగాణ నుంచి కర్ణాటకుకు తరలిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.