మోర్తాడ్, సెప్టెంబర్ 19: నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి శుక్రవారం 2.16లక్షల 138 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1090అడుగుల(76.684టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 51,560 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.
12 వరద గేట్ల ద్వారా 35,293, వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4వేలు, ఎస్కేప్గేట్ల ద్వారా గోదావరిలోకి 4వేలు, సరస్వతీకాలువకు 400, లక్ష్మీకాలువకు 200, మిషన్భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 701క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.