రేపటి (సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు.. బాగా రాస్తామా లేదా అని ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థుల్లో కొంత టెన్షన్ సహజం. కానీ భయం, ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే టెన్ జీపీఏ సాధించడం సులభమే. చదవడంతో పాటు అందంగా రాస్తేనే మంచి గ్రేడింగ్ సొంతం చేసుకోవచ్చు.
– కామారెడ్డి/కోటగిరి, ఏప్రిల్ 1
ఆరు గంటల నిద్ర అవసరం..
బాగా తినాలి.. బాగా చదవాలి.. బాగా పరీక్షలు రాయాలి. ఈ మూడు అంశాలను విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్షల్లో బాగా రాయాలనే ఆత్రుతతో సమయపాలన లేకుండా చదవడం మంచిది కాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పరీక్షా కేంద్రాల్లో కండ్లు మూతపడుతుంటాయి. కునుకు తీయాల్సి వస్తుంది. ఏకాగ్రత కోల్పోతుంది. చదివినవి గుర్తుకురావు. సమాధానాలు సరిగా రాయలేరు. అందుకే పరిపూర్ణంగా నిద్ర పోవాలి. విద్యార్థులు రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం తప్పనిసరి.
ఆహారం ప్రధానం..
ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో కొందరు వార్షిక పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనుకబడిన సందర్భాలు అనేకం. పిల్లలు తమ ఆర్యోగాన్ని కాపాడుకోవడంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజువారీగా తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మేలు. సాత్విక ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతోపాటు ఉత్సాహం చేకూరుతుంది. పండు,్ల కూరగాయలు తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. పరీక్షకు వెళ్లే సమయానికి మూడు గంటల ముందే తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి బలవర్ధకమైన ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.
కామారెడ్డి/కోటగిరి, ఏప్రిల్ 1: విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదో తరగతి వార్షిక పరీక్షలే. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు.. వార్షిక పరీక్షలు దగ్గర పండుతుండడంతో సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. మంచి మార్కులు వస్తాయో లేదోనని ఆందోళన కలుగుతుంది. ఒత్తిడిని ఆదిగమించి, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. చదువుకునే వాతావరణం, తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడంతోపాటు పిల్లల్లో భయాందోళన కలగకుండా ఆత్మ విశ్వాసం నింపడంలో తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతో కీలకం. నచ్చిన ప్రదేశాలు, ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో చదువుకోవడం ఎంతో మేలు. విద్యార్థులు తమ టెన్షన్ దూరం చేసుకునేందుకు నిపుణులు చేస్తున్న సూచనలివీ..
విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారి ప్రోత్సాహం లేకుంటే పిల్లలు ఎందులోనూ రాణించలేరు. మార్కుల పేరిట ఒత్తిడి తేవడం సరికాదు. సందేహాలుంటే వెంటనే నివృత్తి చేయాలి. బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దకూడదు. పిల్లలకు చదువురాదని, మార్కులు తక్కువగా వస్తాయని, ఫెయిల్ అవుతారని, వారి స్నేహితుల కన్నా వెనుకపడ్డావంటూ నెగెటివ్ ధోరణితో కించపర్చొద్దు. ముఖ్యంగా ఫలితాలపై అతిగా అంచనాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు. ర్యాంకులు వస్తాయని ఆశించి, ఆమేర చదవాలని ఒత్తిడి చేయెద్దు. తర్వాత ర్యాంకులు రాలేదని వేధిస్తే మానసిక ైస్థెర్యం కోల్పోయి ముందుకు సాగలేరు.
మానసిక సన్నద్ధత ఇలా…
పరీక్షల్లో చదవడంతోపాటు రాత కూడా ముఖ్యం. చేతిరాత బాగుంటే 10 నుంచి 15 శాతం మార్కులు అదనంగా పొందవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
రాసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి..