బీర్కూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారయ్యింది. స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి ఆహ్వానం మేరకు బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటో తేదీన హాజరుకానున్నారు. ఈ మేరకు స్పీకర్తోపాటు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ జగన్నాథరెడ్డి, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి బీర్కూర్లో శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారిని సీఎం కేసీఆర్ దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెప్పారు. వారి వెంట నస్రుల్లాబాద్ ఎస్సై రంజిత్, ఆలయ కమిటీ సభ్యుడు మద్దినేని నాగేశ్వర్రావ్ తదితరులు ఉన్నారు.
ఆలయ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న స్పీకర్
బాన్సువాడ టౌన్/రుద్రూర్, ఫిబ్రవరి 24: బాన్సువాడ పట్టణంలోని కోటగల్లిలో నిర్మించిన కోట దుర్గమ్మ ఆయల ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ అభినందించారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో దక్షిణముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు.