నిజామాబాద్: పేదింటి ఆడబిడ్డల పెండ్లిలను జరిపించడానికి సీఎం కేసీఆర్అండగా నిలుస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్అన్నారు. మంగళవారం క్యాంప్కార్యాలయంలో నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులందరూ సీఎం కేసీఆర్ కు ఎల్లప్పుడూ అండగా నిలువాలని కోరారు.
అనారోగ్యం బారిన పడినప్పుడు మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవడానికి సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలువడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మాత్రమే బలమైన శక్తిగా ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ కార్యకర్తలు మెదిలి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
కార్యక్రమంలో ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నిజామాబాద్రూరల్ఎంపీపీ బానోత్అనూష, జెడ్పీటీసీ బొల్లెంక సుమలత, తహసీల్దార్ప్రశాంత్కుమార్, గిర్ధావర్భూపతిప్రభు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి, 1వ డివిజన్కార్పొరేటర్కొర్వ లలిత, సర్పంచ్లు లక్ష్మణ్రావు, నగేశ్, లావణ్య, ఎంపీటీసీ అంకల గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు దాసరి లక్ష్మినర్సయ్య, అక్బర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.