బాన్సువాడ/ ఆర్మూర్/ నిజాంసాగర్, అక్టోబర్ 3 : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామంటూ బాన్సువాడ మండలం సోమ్లానాయక్ తండావాసులు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన కాపీని స్పీకర్కు అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పోచారంను ప్రకటించిన సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
జీవన్రెడ్డికి మద్దతుగా..
ఆర్మూర్ మండలం రాంపూర్లోని అన్ని కులాల వారు మంగళవారం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు, రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించి రాంపూర్ గ్రామ ప్రజలంతా రాష్ట్రప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గ్రామం మొత్తం జీవన్రెడ్డికి మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
మేమంతా షిండే వెంటే..
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన మత్స్యపారిశ్రామిక సంఘం సభ్యులు 130 మంది జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్దతుగా మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డికి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. రానున్న ఆసెంబ్లీ ఎన్నికల్లో తామంతా బీఆర్ఎస్, హన్మంత్ షిండే వెంటే ఉంటామని స్పష్టం చేశారు.