కంఠేశ్వర్, ఏప్రిల్ 19: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, తరిమికొట్టే రోజులు ముందున్నాయని జాగ్రత్త అంటూ అర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 420 కాంగెస్ అని, ఆ పార్టీతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. ఎప్పటికైనా రేవంత్రెడ్డి యూటర్న్ సీఎం అని విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..రూ. 2లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే షకీల్పై తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుదర్శన్రెడ్డికి కూడా పిల్లలు ఉన్నారని, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. చీప్లిక్కర్ అమ్ముకునే సుదర్శన్రెడ్డి ఆటలు ఇక సాగవన్నారు. కేసీఆర్ సర్కార్ లక్షా 56 వేల కిలో మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేస్తే నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. నిజామాబాద్ గడ్డ నుంచి ఉద్యమం మొదలైందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. ఎంపీ అర్వింద్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అక్కడ మోదీ ఇజం.. ఇక్కడ రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు.