కోటగిరి, నవంబర్ 11 : సీఎం కేసీఆర్ సహకారంలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొతంగల్ మండలం సుంకిని, కొల్లూర్, పీఎస్ఆర్ నగర్, సోంపూర్, టాక్లీ, హెగ్డోలి, భాకర్ఫారం, కారేగాం, చేనత్నగర్, హంగర్గాఫారం, తిర్మలాపూర్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం గా నిర్వహించారు. స్పీకర పోచారానికి గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెబుతూ ఓట్ల కోసం వస్తున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. రేవంత్రెడ్డి ఓ దొంగ అని మండిపడ్డారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి చేతకాని పథకాలను హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేశారని గుర్తు చేశారు. అక్కడ అమలు చేయని పథకాలు, ఆరు గ్యారంటీలు ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తారా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా అన్ని వర్గాలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలిపారు. మ్యానిఫెస్టో గురించి వివరించారు.
సీఎం కేసీఆర్ దగ్గర నుంచి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడను ఒక అద్దంలా తయారు చేశారని ఎంపీ బీబీపాటిల్ అన్నారు. టాక్లీలో ఆయన మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాసరెడ్డి నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తాడని, ప్రజల మనిషి పోచారం అని అన్నా రు. కారు గుర్తుకు ఓట్లు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలపించాలని విజ్ఞప్తి చేశారు.
పొతంగల్ మండలం టాక్లీ గ్రామ ఉప సర్పంచ్ బలరాం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్పీకర్ టాక్లీలో బలరాంను గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరానని ఉప సర్పంచ్ బలరాం అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి, సర్పంచులు మాధవ్రావు, నాగరాణీ సంపత్, భాగ్యలక్ష్మీనాగరాజుగౌడ్, శాంతాబాయి దిగంబర్పటేల్, జ్యోతి, గౌతంకుమార్, ఎజాజ్ఖాన్, ఎంపీటీసీలు సాయిలు, అనంతవిఠల్, ఉమారాంబాబు, కేశ వీరేశం, గంగాధర్పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, కిశోర్బాబు, ఏఎంసీ హమీద్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.