బాన్సువాడ టౌన్/ వేల్పూర్, సెప్టెంబర్ 10: మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడలో స్పీకర్ పోచారం, వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.