బాన్సువాడ, ఆక్టోబర్ 6: ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. రెవెన్యూ భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించాలని, వివిధ పనుల కోసం వచ్చే వృద్ధు లు, దివ్యాంగులకు ఇబ్బందులు కలుగుకుండా ఉండాలన్నారు. జీ ప్లస్ టూ లో అన్ని ప్రభు త్వ కార్యాలయాలు ఉంటాయని తెలిపారు.
భవన నిర్మాణాల కోసం కొలతలను చేయించారు. భవన నిర్మాణం విశాలంగా ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాలు ఎత్తు మీద ఉండాలని సూచించారు. అనంతరం సమీపంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. వంపుగా ఉన్న స్థలంలో నిర్మించడంపై అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, నాయకుడు మహ్మ ద్ ఎజాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ అబ్బయ్య ఉన్నారు.