ఇందల్వాయి, జనవరి 3: నిరుపేదలను ఆదుకునేందుకు ఆరు గ్యారెంటీలను రూపొందించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కుంట మోహన్రెడ్డి, శివారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్గౌడ్, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.