సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధాయ్యులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. పలుచోట్ల ఉపాధ్యాయుల కొరత ఉండగా, ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసి విద్యాబోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రోజూ ఉదయం, సాయం త్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించడమేగాక విద్యార్థుల్లో మనోబలాన్ని నింపుతూ ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇప్పటికే విద్యార్థులకు అభ్యాస దీపిక పుస్తకాలను అందజేశారు. దాదాపు సిలబస్ పూర్తి కాగా, ముఖ్యమైన సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. గతంలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులతోపాటు సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయులు సైతం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వివిధ సబ్జెక్టులపై సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కాగా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు బాలురు 11,129, బాలికలు 10,612 మంది హాజరుకానున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతులను తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు రోజువారీ టెస్ట్లను నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తి కావడంతో ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించారు. ప్రభుత్వం మార్చిలో ఫైనల్ పరీక్షలు నిర్వహించనుండడంతో విద్యార్థులను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారు.
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతనే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాం. సిలబస్ ప్రకారం బోధన చేపట్టి ఫలితాలు సాధించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. వందశాతం ఫలితాలు, ఉత్తమ జీపీఏ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. విద్యార్థులపై తల్లిదండ్రులు సైతం దృష్టి సారించాలి.
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్నాం.
సబ్జెక్టుల్లో వస్తున్న సందేహాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నాం. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తా. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నా. సబ్జెక్టులలో అర్థం కానివి ఉంటే ప్రత్యేక తరగతులలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నాం.