రుద్రూర్, మార్చి 27: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. రూ.25లక్షల నిధులతో నిర్మించిన నక్కల ఒర్రె బ్రిడ్జిని ప్రారంభించారు. రూ. 10లక్షలతో చేపట్టనున్న హనుమాన్ ఆలయ స్లాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అదనంగా మరో రూ.10లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
దుర్గామాత ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.10లక్షలతో నిర్మించనున్న మసీదు ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గౌస్పాక్ దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 40లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనచేసి, రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రూ.18లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో పోచారం మాట్లాడారు. ఇప్పటి వరకు ఇచ్చి న నిధులతో చేపట్టే నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అక్బర్నగర్ గ్రామానికి ఇప్పటివరకు దాదాపు రూ. మూడు కోట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. పాఠశాలలో వంటశాలకు కావాల్సిన నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరిం చాయి. జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత, వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచ్ గంగామణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, ఏఈ నాగేశ్వర్రావు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.