నిజామాబాద్ రూరల్/సిరికొండ, ఆగస్టు 1 : ఉమ్మడి రాష్ట్ర పాలనలో తొమ్మిది దశాబ్దాల నుంచి కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఆర్టీసీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు నిర్ణయించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్ ప్రాంగణంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి బాజిరెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఎలాగైనా కాపాడాలని సీఎం కేసీఆర్ గత ఏడాది రూ.100 కోట్ల నిధులు కేటాయించడంతో పలు సంస్కరణలు అమలు చేస్తూ నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అందు లో పనిచేసే వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో వారి దశాబ్దాల కల సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న మహానుభావుడని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని తెలిపారు. బాజిరెడ్డిని కలిసిన వారిలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్నాయక్, నాయకులు బానోత్ ప్రేమ్దాస్నాయక్, శంకర్నాయక్, గోపాల్నాయక్, శ్రీరాంనాయక్ తదితరులున్నారు.
మంత్రి సత్యవతిని కలిసిన జిల్లా బంజారా నాయకులు
రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను ఆర్అండ్బీ సీఈ మోహన్నాయక్ ఆధ్వర్యంలో జిల్లా బంజారా నాయకులు మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేసేందుకు తన వంతు సంపూర్ణ సహకారమందించిన మంత్రి సత్యవతికి వారు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. జిల్లాలో గిరిజనుల అ భ్యున్నతి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసిన ఆర్టీసీ చైర్మన్
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్లో మంగళవారం కలిశారు.వీరితో పాటు తూం పల్లి, కొండాపూర్ గ్రామాల సర్పంచులు, పెద్దలు ఉన్నారు. సిరికొండ మండలం కొండాపూర్, తూం పల్లి గ్రామాల్లో దేవాలయల నిర్మాణానికి రూ. కోటీ 5లక్షలు మంజూరు చేశారు.
నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞలు తెలిపారు. కార్యక్రమంలో కొండాపూర్ హన్మాన్ మందిర చైర్మన్ నర్సయ్య, సర్పంచులు పోడెండ్ల రమేశ్, పల్లె బాలమణి మల్లేశ్, సొసైటీ వైస్ చైర్మన్ అబ్బాస్, చందర్, రాజగంగారం, బుచ్చన్న, బక్కన్న, రాజు, చిరంజీవి, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ చైర్మన్
టీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం సీఎం కేసీఆర్ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులంతా సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వారి తరపున కృతజ్ఞతలు తెలియజేశామన్నారు.