ఇందల్వాయి, మార్చి 25: నాడు ఉద్యమంలోనే ఢిల్లీ పాలకులకు భయపడలేదని.. ఇప్పుడు భయపడతామా అని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతల మెడలు వంచి, మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడతామని స్పష్టంచేశారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రా మంలోని మున్నూరు కాపు సంఘంలో బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని కార్యకర్తలకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చదివి వినిపించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కార్యకర్తలందరినీ క్షేత్రస్థాయి లో నాయకులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వానికి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని, వారు చేస్తున్న అసత్యప్రచారాలను తిప్పికొట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మోదీ సర్కార్ కాపీ కొడుతుందన్నారు.
బీఆర్ఎస్ను చూసి బీజేపీలో భయం మొదలైందని.. అందుకే మంత్రులు, ఎంపీలపై ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నదన్నారు. తెలంగాణలో రైతాంగానికి ఉచిత కరెంటు సరఫరా చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు పంప్సెట్లకు మీటర్లు బిగించుకోవాలని హుకూం జారీ చేసిందని చెప్పారు. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో అభివృద్ధి శూన్యమని, అక్కడ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి పథకాలు లేవని గుర్తుచేశారు. రూరల్ నియోజకవర్గంలో లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మంచిప్ప రిజర్వాయర్కు రూ. 2600 కోట్లు మంజూరు చేసి పనులు చేపడుతుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ ప్రాంత రైతాంగాన్ని రెచ్చగొట్టి పనుల నిలుపుదలకు కుట్ర పన్నారన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడ్డా 3.5 టీఎంసీల ప్రాజెక్టు పనులను పూర్తిచేసి రైతాంగానికి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందించి బీడు భూములన్నీ సాగులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ని యోజకవర్గంలోని ప్రతి గిరిజన పంచాయతీలో సీసీరోడ్లకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. ధర్పల్లి మండలానికి డిగ్రీ కళాశాల మం జూరు చేశామని, డిచ్పల్లిలో మెడికల్ కళాశాల, సిరికొండలో ఐటీఐను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ. 46కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు ద్వారా నియోజకవర్గంలోని 1100 మందికి రూ.10లక్షల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. మొదటి విడుతలో 200 మందికి దళితబంధు యూనిట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకునే నిరుపేదలకు రూ.3లక్షల చొప్పున నియోజకవర్గంలో 3వేల మందికి ఇండ్లు మంజూరు చేస్తామని ఆర్టీసీ చైర్మన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ గడ్డం సుమనారవిరెడ్డి, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, సర్పంచ్ తేలు విజయ్, ఎంపీటీసీ కచ్చకాయల అశ్వినీశ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘునందన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బిరీశ్ శెట్టి, విండో చైర్మన్ గోవర్ధన్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కొరట్పల్లి ఆనంద్, ఎంపీటీసీలు చింతలదాసు, బాబూరావు, మారంపల్లి సుధాకర్, సుధీర్, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పులి వసంత, సీనియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, మొచ్చ గోపాల్, క్రాంతికుమార్, ప్రవీణ్గౌడ్, పులి సాగర్, నరేశ్, శేఖర్, పరుశురాం, మోహన్ నాయక్, లక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ముగిసిన అనంతరం ఆరుబయట ఉన్న మహిళల వద్దకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వినతులను స్వీకరిస్తూ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, మీరంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. సమ్మేళనానికి వచ్చినవారందరూ భోజనం చేశారా లేదా అంటూ పలకరించారు. వారితో ఫొటోలు దిగి ఉత్సాహాన్ని నింపారు.
తండ్రి రాజ్యసభ హోదాలో ఉండి జిల్లా అభివృద్ధికి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో, అతని కొడుకు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచాక మోసం చేసిన విషయాన్ని రైతులు గమనిస్తున్నారన్నారు. రాజ్యసభ, ఎంపీగా ఉన్న తండ్రీకొడుకులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.45 కోట్లు నిధులు మంజూరైతే వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన ఎంపీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేసేవారిపై బురదజల్లే మాటలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఎమ్మెల్సీ కవితను బీజేపీ నాయకులు లేనిపోని కేసుల్లో ఇరికించి బద్నాం చేసే పనిలో నిమగ్నమయ్యారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఈడీ పేరుతో కవితను ఢిల్లీకి పిలుస్తూ ఆమె కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. అయినా భయపడకుండా ఈడీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు కవిత నవ్వుతూ వెళ్లి వస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్న కవితకు యావత్ దేశం సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ తీరు మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.