ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావనందిలో ఏడు తులాల బంగారం, రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
బాన్సువాడ, మే 23 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు ఇంటిలో దాచి ఉంచిన రూ. 29.40 లక్షలను దుండగులు అపహరించారు. పట్టణ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. కూతురు, అల్లుడు నాగేశ్వర్ రావు వద్దే ఉంటున్నారు. తన మేనకోడలు నూతన వస్ర్తాలంకరణ వేడుక ఆదివారం ఉదయం ఉండడంతో కూతురు, అల్లుడుతో కలిసి కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంపునకు వెళ్లారు. అల్లుడు రాము నెల రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా అమరచింత గ్రామంలోని తన వ్యవసా య భూమిని అమ్మాడు.
భూమిని విక్రయించగా వచ్చి న డబ్బులతో బాన్సువాడలో వ్యవసాయ భూమి లేదా ప్లాట్ కొనుగోలు చేద్దామని తన మామ ఇంట్లో దాచా డు. శుభకార్యం ముగించుకొని ఎక్లాస్పూర్ నుంచి రా త్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పాటు ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బెడ్ రూమ్లో దాచి ఉంచిన రూ.29 లక్షల 40 వేలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తిం చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ రాజశేఖర్రెడ్డి సోమవారం ఉదయం పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
న్యావనందిలో..
సిరికొండ,మే 23 : మండలంలోని న్యావనంది గ్రా మంలో దొంగలు హల్చల్ చేశారు. బాధితులు రాత్రి దాబాపై నిద్రించి తెల్లవారుజామున ఇండ్లలోకి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. బాధితులు ఆదివారం రాత్రి దాబాపై నిద్రించగా దుండగులు తాళా లు పగులగొట్టి ఇండ్లలో చోరీకి పాల్పడ్డా రు. సుమారు రూ.2లక్షల నగదులో పాటు 7తులాల బంగారు ఆభరణాలు చోరీకి గు రయ్యాయి. మామిడికింది నర్స య్య, మామిడికింది నరేందర్ ఇద్దరు అన్నదమ్ముల ఇండ్లలో సుమారు ఏడు తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, బర్ల లిం గం ఇంట్లో రూ. లక్షా 50వేల నగదును ఎత్తుకెళ్లారని ఎస్సై తెలిపారు. సదానందం, రిక్క యమున, పులి నా గరాజు, రిక్క సుజాత ఇండ్లలో దొంగలు బీరువా లాకర్లను ధ్వంసం చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీశైలం పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది.